సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

సింగరేణి(Singareni) కార్మికులకు తెలంగాణ సర్కార్(Telangana Govt) గుడ్ న్యూస్ తెలిపింది.

Update: 2024-10-24 10:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : సింగరేణి(Singareni) కార్మికులకు తెలంగాణ సర్కార్(Telangana Govt) గుడ్ న్యూస్ తెలిపింది. రానున్న దీపావళి(Diwali) పండగ నేపథ్యంలో కార్మికులకు పండగ బోనస్ ఇస్తున్నట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రకటించారు. దీపావళి బోనస్ కింద రూ.358 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. రేపు ఉదయం లోగా 40 వేల మంది కార్మికుల ఖాతాల్లో ఇవి జమ కానున్నట్టు భట్టి పేర్కొన్నారు. పండగ బోనస్ గా ప్రతి కార్మికుడు రూ.93,750 అందుకోనున్నారు. గతేడాది కంటే ఈసారి రూ.50 కోట్ల అధిక బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై సింగరేణి కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Similar News