BJP: నోరు మెదపని నకిలీ లౌకికవాదులు.. తెలంగాణ బీజేపీ సంచలన ట్వీట్

Update: 2024-10-24 10:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నోరు మెదపని నకిలీ లౌకికవాదులు అంటూ తెలంగాణ బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు స్పందించడం లేదని ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టిన బీజేపీ రెండు పార్టీలపై మండిపడింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై.. హిందువులపై దాడికి శిక్షణా కేంద్రాలు నడుపుతున్న మత ప్రచారకులపై.. హిందువులపై జరిగిన అమానుషమైన లాఠీచార్జిపై నకిలీ లౌకికవాదులు నోరు మెదపడం లేదని చెబుతూ.. రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలను పోస్ట్ లో పెట్టింది. అలాగే దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ దృష్టిలో లౌకికవాదం అంటే.. మతోన్మాదులను అమాయకులుగా చిత్రీకరించడమని, తమ విశ్వాసాలను కాపాడుకుంటున్న హిందువులను మతోన్మాదులుగా చిత్రీకరించడమని వ్యాఖ్యానించింది.

 


Similar News