యూట్యూబ్ జర్నలిస్ట్స్ రేవతి, తన్వి యాదవ్లకు బెయిల్
సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యవహారంలో అరెస్టు అయిన జర్నలిస్టు రేవతి, తన్వి యాదవ్ అలియాస్ బండి సంధ్యలకు నాంపల్లి కోర్టు ఊరటనిచ్చింది...

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యవహారంలో అరెస్టు అయిన జర్నలిస్టు రేవతి, తన్వి యాదవ్ అలియాస్ బండి సంధ్యలకు నాంపల్లి కోర్టు ఊరటనిచ్చింది. రూ.25 వేల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమ, మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్ ఫిర్యాదు మేరకు రేవతి, తన్వీలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది.