నాలెడ్జి సిటీలో అర్ధరాత్రి యువకుల బైక్ రేసింగ్..

యువకులు బైక్ లపై ప్రమాదకర స్టెంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు.

Update: 2024-10-20 09:10 GMT

దిశ, శేరిలింగంపల్లి : యువకులు బైక్ లపై ప్రమాదకర స్టెంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు, జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జి సిటీ వద్ద యువకులు పెద్ద ఎత్తున రేసింగ్ లకు పాల్పడ్డారు. రోడ్ల పై బైకులతో విన్యాసాలు చేస్తూ వీరంగం సృష్టించారు.

గతంలో కూడా ఇలాంటి రేసింగ్ లకు పాల్పడిన వారి పై రాయదుర్గం పోలీసులు కేసులు నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కేసులు నమోదు అయిన లైట్ గా తీసుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి, శనివారం అర్ధరాత్రి రోడ్ల పై బైకులతో విన్యాసాలు చేస్తూ వెళుతున్న వారిని భయబ్రాంతులను గురిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పదిమంది బైక్ రైడర్లను అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులు వారి వద్ద నుంచి పది రేసింగ్ బైకులను స్వాధీనం చేసుకొని కేసునమోదు చేశారు.


Similar News