ఆధ్యాత్మికత ముసుగులో బాలల పై లైంగిక నేరాలు

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్యాత్మికత ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారి పెంపకానికి కేంద్రంగా నిలుస్తుందని మాజీ అధ్యాపకులు రాగిణి, ఏపీ,

Update: 2024-10-17 08:51 GMT

దిశ, హిమాయత్ నగర్ : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్యాత్మికత ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారి పెంపకానికి కేంద్రంగా నిలుస్తుందని మాజీ అధ్యాపకులు రాగిణి, ఏపీ, తెలంగాణ ప్రాంతీయ కమిటీ సభ్యులు సత్య రాగిణి లు వెల్లడించారు. ఆశ్రమ నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈషా ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలు, ఇషా విద్య, సంస్కృతి, ఇషా హోమ్ స్కూల్లో 8000 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. బాలికలపై జరిగే నేరాలకు ఈషా ఫౌండేషన్, ఈషా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, ట్రస్టీలు, ముఖ్యంగా వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ (సద్గురు) బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. ఈషా సెంటర్లో విద్యా కార్యక్రమాల పేరుతో ఈషా సంస్కృతికి చెందిన బాలికలను అర్ధనగ్నంగా ఆధ్యాత్మిక దీక్షలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

పాఠశాలలో 8 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం జరిగిన బయటకు రాకుండా మౌనం వహించారని తెలిపారు. 13 ఏళ్ల బాలుడిని 3 సంవత్సరాల పాటు వేధించారని కూడా ఆరోపణలు వచ్చాయని చెప్పారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు తాను సాక్షాత్కారమైన ఆత్మ, కరుణతో నిండి ఉన్నాడని, ఇషా సంస్కృతి ఇషా హోమ్ స్కూల్ విద్యార్థులపై జరుగుతున్న అకృత్యాలపై ఎప్పుడూ నోరు విప్పడం లేదని పేర్కొన్నారు. 12వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడి మరణం (జూన్ 21, 2024, అంతర్జాతీయ యోగా దినోత్సవం) యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా బోర్డులు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండా మానవ సంక్షేమం ముసుగులో ఈషా ఫౌండేషన్, ఈషా ఎడ్యుకేషన్ చేస్తున్న ఈదురాగతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Similar News