ప్రియా సిస్టర్స్ పాటలు అద్బుతం

అద్భుతమైన పాటలతో తెలుగు ప్రేక్షకులకు ప్రియా సిస్టర్స్ చేరువయ్యారని, వారి పాటలు అద్బుతమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు.

Update: 2024-07-04 16:01 GMT

దిశ, రవీంద్రభారతి : అద్భుతమైన పాటలతో తెలుగు ప్రేక్షకులకు ప్రియా సిస్టర్స్ చేరువయ్యారని, వారి పాటలు అద్బుతమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు. గురువారం రాత్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య 91వ జయంతి సందర్భంగా శ్రీ వాసవి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసులు, ప్రియా సిస్టర్స్​గా పేరొందిన అక్కాచెల్లెళ్లు హరిప్రియ,

    షణ్ముఖప్రియలకు జీవన సాఫల్య పురస్కార ప్రదానం రవీంద్రభారతి లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, కేవీపీ రామచంద్ర రావు హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, కేవీపీ రామచంద్ర రావులు జీవన సాఫల్య పురస్కార ప్రదానం బహూకరించారు. ప్రియా సిస్టర్స్ అద్భుతమైన పాటలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. కె. మల్లికార్జున్ రావు, ఈశ్వర్ రావు పాల్గొన్నారు. 


Similar News