ఢిల్లీ బోనాల ఉత్సవాలకు బయలుదేరిన లాల్​దర్వాజా ఆలయ కమిటీ

లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశరాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఈ నెల 8,9,10వ తేదీలలో జరుగనున్న బోనాల ఉత్సవాలకు

Update: 2024-07-07 14:06 GMT

దిశ, చార్మినార్ : లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశరాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఈ నెల 8,9,10వ తేదీలలో జరుగనున్న బోనాల ఉత్సవాలకు ఆదివారం సాయంత్రం లాల్​దర్వాజా మహంకాళి దేవాలయం నుంచి పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ప్రతినిధులు బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సి,రాజేందర్​ యాదవ్​ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బంగారు బోనంతో పెద్ద ఎత్తున కళాకారుల బృందంతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు.


Similar News