ఢిల్లీ బోనాల ఉత్సవాలకు బయలుదేరిన లాల్దర్వాజా ఆలయ కమిటీ
లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశరాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఈ నెల 8,9,10వ తేదీలలో జరుగనున్న బోనాల ఉత్సవాలకు
దిశ, చార్మినార్ : లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశరాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఈ నెల 8,9,10వ తేదీలలో జరుగనున్న బోనాల ఉత్సవాలకు ఆదివారం సాయంత్రం లాల్దర్వాజా మహంకాళి దేవాలయం నుంచి పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ప్రతినిధులు బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సి,రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బంగారు బోనంతో పెద్ద ఎత్తున కళాకారుల బృందంతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు.