రేపు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం

ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య తెలిపారు.

Update: 2024-07-06 15:03 GMT

దిశ, చార్మినార్ : ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య తెలిపారు. నగరంలోని అమ్మవారి దేవాలయాలతో పాటు విజయవాడలోని కనక దుర్గ అమ్మవార్లకు బంగారు బోనాలను సమర్పించనున్నామని, ఇందులో భాగంగానే మొదటి బంగారు బోనాన్ని గొల్కొండ జగదాంబ బోనాల

     జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్నామన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పాతబస్తీ మీరాలంమండి మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బోనంతో భారీ ఊరేగింపుగా గోల్కొండ కోటకు బయలు దేరుతామన్నారు. పోతురాజుల నృత్యాలు, కళా కారుల కళా ప్రదర్శనలతో జోగిని నిషా క్రాంతి బంగారు పాత్రలోని నైవేద్యాన్ని తలపై పెట్టుకుని సంప్రదాయ బద్దంగా గోల్కొండ జగదాంబ అమ్మవారికి బోనం సమర్పించనున్నామన్నారు. 


Similar News