మద్యం మత్తులో వాచ్మెన్ దారుణ హత్య
మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వాచ్మెన్ దారుణ హత్యకు గురైన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దిశ, సికింద్రాబాద్: మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వాచ్మెన్ దారుణ హత్యకు గురైన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్ తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పరి బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనం లో వాచ్మెన్ గా పనిచేస్తున్న కుమ్మరి రామచంద్రయ్య (40) అదే భవనంలో రాళ్ళ పనిచేసే సలీమ్ తో కలిసి రెండో ఫ్లోర్ లో నిన్న రాత్రి 10 గంటలకు మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశంలో సలీమ్, రామచంద్రయ్యను ఇనుప రాడ్ తో తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై రామచంద్రయ్య అక్కడికక్కడే మరణించాడు. రామచంద్రయ్య భార్య స్వరూప ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం గాలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.