HYD : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-08-06 05:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. కారు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో వ్యక్తి తల తెగి కారు వెనుక సీటులో పడింది. మృతుడిని శంషాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Similar News