హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్‌)లో వరద ఉగ్రరూపం

హైదరాబాద్ మహానగరంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది.

Update: 2024-09-01 06:41 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగరంలో అన్ని నాలాలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతానికి కూడా భారీ వర్షం పడుతుండటంతో దాదాపు 1000 క్యూసెక్కుల వరద ప్రవాహం ట్యాంక్ బండ్ లోకి వస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం అయిన 513.41 మీటర్లను దాటింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని మూసీనదికి వదులుతున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేశారు.


Similar News