టోల్ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
దిశ, వెబ్డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో ఇద్దరు మృతి చెందారు. నేరడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద రాత్రి ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సురేష్ (31), సాయన్న (45) మృతి చెందారు. మృతదేహాలను బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.