ప్రజా ప్రయోజనాల కోసమే షెడ్యుల్ ప్రకారం పరీక్షలు.. మంత్రి సీతక్క

నిరుద్యోగులకు న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి సీతక్క గుర్తు చేశారు.

Update: 2024-07-14 15:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి సీతక్క గుర్తు చేశారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాటు నియామకాలు లేవని, ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తుందని ఆదివారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసమే షెడ్యుల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగ నియామ‌కాల‌పై గ‌త ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని, ఆ నిర్లక్ష్యపు నీడలు ఇప్పటికీ ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. న్యాయ పరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉన్నదని, అందుకే వాయిదా వేయడానికి కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదన్నారు. పైగా గత పది సంవత్సరాల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు లేక లక్షలు ఖర్చు చేసి కోచింగ్లు తీసుకున్న నిరుద్యోగుల ప‌రిస్థితి ఆగ‌మ్యగోచరంగా మారిపోతుందన్నారు. ఖాళీలన్నీంటికి త్వరలో మరో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని సీతక్క క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News