బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి సతీమణి కన్నుమూత

బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి కన్నుమూశారు.

Update: 2024-09-10 02:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. కాసేపట్లో స్వగ్రామమైన తిమ్మాజిపేట మండలం ఆవంచకు ఆమె పార్థివదేహాన్ని తీసుకురానున్నట్టు తెలిసింది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే.



 



Similar News