BREAKING : బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టుపై ఈటల కీలక వ్యాఖ్యలు..

బీజేపీలో స్టేట్ చీఫ్ మార్పు వార్తలు వస్తున్న వేళ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-21 13:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో స్టేట్ చీఫ్ మార్పు వార్తలు వస్తున్న వేళ మల్కాజ్‌గిరి ఎంపీ, స్టేట్ చీఫ్ రేసులో ఉన్న ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. ఏ ఎన్నికలు వచ్చినా.. బీజేపీ తక్కువ చేసి చూడదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఎలా కొట్లాడామో స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే బీజేపీ కొట్లాడుతుందన్నారు. పార్టీ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిపించుకోవడం మాత్రమే కాదన్నారు. పార్టీకి పునాది రాళ్లు కార్యకర్తలే అన్నారు. వాళ్లు లేకుండా పార్టీ లేదన్నారు. పార్టీలో కొత్త, పాత నాయకులు ఎవరికీ తక్కువ కాకుండా బీజేపీ ముందుకు వెళ్తుందన్నారు. ఒక పార్టీ ఎదగాలంటే.. అధికారంలోకి రావాలంటే కొత్త శక్తి, కొత్త నీరు, కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాల్సిందే అన్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కావడం, అంతకుముందు ఉన్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి కావడంతో రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఈటలను వరించనుందని గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. 


Similar News