Double Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్ కాంట్రవర్సీ.. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై BRSV కంప్లైంట్

‘లైగర్’ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ఈ మూవీని పూరి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తు్న్నారు.

Update: 2024-07-19 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘లైగర్’ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ఈ మూవీని పూరి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తు్న్నారు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ మూవీలోని ‘మార్ ముంత చోడ్ చింత’ పాటలో కేసీఆర్ తరుచూ వాడే ‘ఏం చేద్దామ్ అంటావ్ మరి’ అనే డైలాగ్‌ను కేసీఆర్ వాయిస్‌తోనే ఈ పాటలో హుక్ లైన్‌గా వాడటం వివాదస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా, డబుల్ ఇస్మార్ట్ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు కంప్లైంట్ చేశారు. పాటలో కేసీఆర్ వాయిస్ పెట్టడంపై బీఆర్ఎస్వీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ వాయిస్‌తో ఉన్న పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ పూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు పోలీసులను కోరారు.    


Similar News