హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి నెక్లెస్రోడ్లో సందడి షురూ
హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఇవాళ్టి నుంచి ఆల్ ఇండియా హార్టికల్చర్ మేళా జరుగబోతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఇవాళ్టి నుంచి ఆల్ ఇండియా హార్టికల్చర్ మేళా జరుగబోతోంది. ఈ విషయాన్ని మేళా ఇన్చార్జి ఖలీద్ అహ్మద్ తెలిపారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో గురువారం నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు కొనసాగిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేళాను సందర్శించవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆమె బుధవారం ప్రత్యేక బ్రౌచర్ను ఆవిష్కరించారు. ఈ మేళాను మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, హార్టీకల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మీన్ భాషా ప్రారంభించనున్నారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి కొత్త పద్ధతులను షోలో ప్రదర్శిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఏపీ, కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, పుణె, షిర్డీ, కడియం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్తో 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.