హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. సచివాలయంలో సీఎస్ అత్యవసర సమీక్ష

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి రాష్ట్ర సచివాయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2024-08-29 07:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి రాష్ట్ర సచివాయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చిస్తున్నారు. కాగా, చెరువులు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ ప్రాంతాల్లో ఆక్రమలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైడ్రా పేరు వింటే కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.

తమ భవనాలను ఎక్కడ కూల్చివేస్తారోననే భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో క్రమంలోనే ఇవాళ సీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతేకాదు.. ఈ భేటీలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సైతం హాజరయ్యారు.


Similar News