రమేష్ కార్తీక్ నాయక్‌ను అభినందిస్తూ సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్

యువకవి, రచయిత రమేష్ నాయక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కరం 2024 రాగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పెషల్ ట్వీట్ చేశారు.

Update: 2024-06-19 06:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: యువకవి, రచయిత రమేష్ నాయక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కరం 2024 రాగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పెషల్ ట్వీట్ చేశారు. అతిపిన్న వయసులో తన రచన ‘ధవ్లో’కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కించుకున్న నిజామాబాద్ జిల్లా రమేష్ కార్తీక్ నాయక్‌కు అభినందనలు తెలుపుతున్నా అన్నారు. ఈ అవార్డు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకే కాదు. తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవం అన్నారు. భవిష్యత్తులో కార్తీక్ మరిన్ని మంచి రచనలు చేయాలని.. సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు.


Similar News