కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించేందుకు గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

Update: 2024-07-04 06:10 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించేందుకు గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. కాగా ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది.


Similar News