ఈనెల 12న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ఈనెల 12న జరగనుంది.

Update: 2024-07-06 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ఈనెల 12న జరగనుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఉదయం 10 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమావేశాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు కీలక అంశాలపై మార్గదర్శనం చేయనున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరగనుంది. పార్టీ సంస్థాగత విషయాలు, భవిష్యత్ కార్యక్రమాలు, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు, కర్ణాటక రాష్ట్ర సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, శాసనమండలి పక్షనేత ఏవీఎన్ రెడ్డి గారు, ఇతర జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. వారితో పాటు రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష- ప్రధాన కార్యదర్శులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్లమెంట్- ప్రభారీలు, కన్వీనర్, జాయింట్ కన్వీనర్లు, అసెంబ్లీ- ప్రభారీ, కన్వీనర్, జాయింట్ కన్వీనర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, రాష్ట్రస్థాయి విభాగాలు(సెల్స్) కన్వీనర్, జాయింట్ కన్వీనర్లు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, వివిధ మోర్చాల- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జాతీయ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇతర ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటారు.


Similar News