CM Revanth: రికార్డు స్థాయిలో వరి దిగుబడి : తెలంగాణ రైతులపై సీఎం ప్రశంసలు

తెలంగాణలో ఈ ఏడాది వరి దిగుబడి పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Update: 2024-11-17 07:50 GMT
CM Revanth: రికార్డు స్థాయిలో వరి దిగుబడి : తెలంగాణ రైతులపై సీఎం ప్రశంసలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో వరి దిగుబడి పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల (Telangana Farmers) ఘనత ఇది అని ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందని (Highest Paddy Production) బీఆర్ఎస్ చేసిన ప్రచారం తప్పని తేలిపోయిందన్నారు సీఎం రేవంత్. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి.. నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా.. ఎన్డీఎస్ఏ(NDS) సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా.. కాళేశ్వరంతో (Kaleshwaram Project) సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్నారు.

"ఇది తెలంగాణ రైతుల ఘనత.. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం.. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు" అని రేవంత్ ఆ పోస్టులో పేర్కొన్నారు. గతేడాది 65.94 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 144.8 లక్షల టన్నుల వరి పంట ఉత్పత్తి అయింది. ఈ ఏడాది 66.77 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 153 లక్షల టన్నుల వరిపంట ఉత్పత్తి జరిగింది. 

Tags:    

Similar News