హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌ను సీఎం దెబ్బతీశారు: హరీశ్ రావు

మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పాలనపై మరోసారి విమర్శలు చేశారు.

Update: 2024-09-11 13:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పాలనపై మరోసారి విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలను గాలికి వదిలేసిందని.. హైడ్రా పేరిట రాష్ట్రంలో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీపై ఇచ్చిన 800 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండు ఇమేజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఖతం చేశాడని.. నగర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ 9 నెలల పాలనలో 2 నెలల పెన్షన్‌ మింగేశారని, రైతులకు 100 శాతం రుణమాఫీ అయ్యేదాకా, పంట బీమా, భరోసా కల్పించకపోతే రానున్న కాలంలో బీఆర్ఎస్ ఆందోళనలు చేపడుతుందని హరీష్‌ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


Similar News