Chhattisgarh : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో మరోసారి ఎదురు కాల్పులు కలకలం రేపాయి.

Update: 2024-07-19 06:01 GMT

దిశ, ములుగు ప్రతినిధి: తెలంగాణ సరిహద్దుల్లో మరోసారి మావోయిస్టు, పోలీసుల మధ్య కాల్పులు కలకలం రేపుతున్నాయి. చర్ల మండలంలోని తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దు ఇలిమిడి అటవీ ప్రాంతంలో గ్రే హౌండ్స్ బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందినట్టు సమాచారం. భారీగా ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.సరిహద్దు ప్రాంతంలో ఇంకా ఇరువురు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం కాల్పులు జరుగుతుండడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం గుప్పెట్లో తలదాచుకుంటున్నారు.


Similar News