చంద్రబాబు చేసిన పాపాలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Update: 2024-02-09 11:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు వరుసగా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి పేర్నీ నాని టీడీపీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు ఢిల్లీ బాటపట్టారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఆయన ఏ గడ్డైనా కరుస్తాడని విమర్శించారు. వైసీపీని ఎదర్కొనే దమ్ము, ధైర్యం లేకనే పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసేందకు వస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని చంద్రబాబు వారితో పొత్తు పెట్టుకుంటున్నాడని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ప్రజలు క్షమించరని అన్నారు, ఆయన చేసిన పాపాలకు ముందుగా ప్రజలకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News