కాంగ్రెస్ మంత్రులను కోతులతో పోల్చిన BRS ఎమ్మెల్యే

దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం పాల్గొని మాట్లాడారు.

Update: 2024-01-21 08:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం పాల్గొని మాట్లాడారు. ఐటీ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో నిటబెట్టారని అన్నారు. రేవంత్ గుంపు మేస్త్రీ గొప్పతనం ఏంటో తెలిసిపోయిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపులా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటినుంచి తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌దే గెలుపు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని అన్నారు.

Tags:    

Similar News