BIG BREAKING: విద్యుత్ వినియోగదారులకు గూడ్ న్యూస్.. ఛార్జీల పెంపుపై డిస్కం సీఎండీ సంచలన ప్రకటన
రాష్ట్రంలో ప్రభుత్వం కరెంట్ చార్జీల పెంచబోతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ (DISCOM CMD Musharraf Farooqui) స్పందించారు.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం కరెంట్ చార్జీల పెంచబోతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ (DISCOM CMD Musharraf Farooqui) స్పందించారు. ఈ మేరకు ఆయన సామాన్య ప్రజలపై చార్జీల భారం మోపడం లేదని స్పష్టం చేశారు. ఇంకా కరెంట్ చార్జీల పెంపు విషయంలో తాము ఎలాంటి ప్రకటన చేయలేదని.. మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ అంటూ కొట్టి పాడేశారు.
కాగా, సదరన్ డిస్కం ప్రతిపాదించిన విద్యుత్ యాగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్స్ (Aggregate Revenue Requirements)పై విద్యుత్ నియంత్రణ మండలి (Electricity Regulatory Board) చైర్మన్ శ్రీరంగరావు అధ్యక్షతన బుధవారం బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఏఆర్ఆర్ ప్రతిపాదనలను ముషారఫ్ ఫారూఖీ సమగ్రంగా వివరించారు. హై టెన్షన్ (హెచ్టీ 11కేవీ) వినియోగదారులపై చార్జీల భారం పడదని ఆయన పేర్కొన్నారు. నెలకు 300 యూనిట్లకు పైగా కరెంట్ వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులకు ఫిక్స్డ్చార్జీల రూపంలో రూ.50 పెంచాలని తాము ప్రభుత్వానికి ప్రతిపాదించామని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు.