పాతబస్తీలో దారుణం.. పదిహేను రోజుల పసికందు విక్రయం

హైదరాబాద్ నగరంలో పాతబస్తీలో ఓ దారుణం వెలుగు చూసింది.

Update: 2024-09-23 12:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో పాతబస్తీలో ఓ దారుణం వెలుగు చూసింది. ముక్కుపచ్చలారని 15 రోజుల పసికందును అమ్మేందుకు ప్రయత్నాలు జరిగాయి. పసికందు విక్రయ ఘటన మీద సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగప్రవేశం చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. పసికందును అమ్మేందుకు యత్నించిన మొత్తం 9 మంది నిందితులలో.. చిన్నారి తల్లీదండ్రులతో సహ ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. కాగా ఈ ఘటనపై చంద్రాయణగుట్ట పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.    


Similar News