తెలంగాణలో రిపోర్ట్ చేసిన ఏపీ ఐఏఎస్లు
తెలంగాణ సీఎస్ శాంతి కుమారి(Telangana CS Shanti Kumari)ని ఏపీ ఐఏఎస్(AP IAS)లు కలిశారు. డీవోపీటీ ఆదేశాల మేరకు సీఎస్ను కలిసి సృజన, శివ శంకర్లు రిపోర్ట్ చేశారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ సీఎస్ శాంతి కుమారి(Telangana CS Shanti Kumari)ని ఏపీ ఐఏఎస్(AP IAS)లు కలిశారు. డీవోపీటీ ఆదేశాల మేరకు సీఎస్ను కలిసి సృజన, శివ శంకర్లు జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. కాగా, ఏపీలో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్లను తెలంగాణకు అటాచ్ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ఐపీఎస్లు ససేమిరా అంటున్నారు. క్యాట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా భంగపాటు తప్పలేదు. తెలంగాణ హైకోర్టు కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో అధికారులకు న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. అన్ని మార్గాలు మూసుకుపోవడంతో విధిలేక ఆంధ్రప్రదేశ్లో వారు రిపోర్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిపోర్ట్ చేసేందుకు ఇవాళే ఆఖరు తేదీ కావడం గమనార్హం.