కాంగ్రెస్ నేతల జోలికి వస్తే సహించేది లేదు-ఎమ్మెల్యే

బీఆర్ఎస్ నేతలు అకారణంగా కాంగ్రెస్ నేతల జోలికి వస్తే.. సహించేది లేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హెచ్చరించారు.

Update: 2024-10-16 14:38 GMT

దిశ, మిర్యాలగూడ : బీఆర్ఎస్ నేతలు అకారణంగా కాంగ్రెస్ నేతల జోలికి వస్తే.. సహించేది లేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడిన దామరచర్ల మండల కేంద్రానికి చెందిన ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర నాయకులు హరిప్రసాద్ ను బుధవారం ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడతూ.. ప్రజాపాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి,కార్యకర్తలకు సపోర్టుగా ఉంటూ.. ప్రజల ఆదరణ పొందాల్సిన బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు దాడులకు, అసత్య ఆరోపణలకు, ఇతర చర్యలకు పాల్పడితే రానున్న రోజుల్లోనూ ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదన్నారు. మరోసారి ఈ తరహా చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.


Similar News