హర్షసాయి బాధితురాలి మరో ఫిర్యాదు

యూట్యూబర్ హర్షసాయి(HarshaSai) బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది.

Update: 2024-10-04 03:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : యూట్యూబర్ హర్షసాయి(HarshaSai) బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. హర్షసాయి సోషల్ మీడియాలో తనపై నెగెటివ్ ట్రోలింగ్ చేయిస్తూ.. మానసికంగా వేధిస్తున్నాడని పేర్కొంది. తనమీద ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేస్తున్నవారిపై, చేయిస్తున్న హర్షసాయి మీద చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. దీనికి సంబంధించిన పలు సోషల్  మీడియా అకౌంట్ల స్క్రీన్ షాట్స్ ను పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా తెలుగు టాప్ యూట్యూబర్ హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి, తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సగంటి తెలిసిందే. ఈ కేసు అనంతరం హర్షసాయి, అతని అభిమానులు తనను నెట్లో ట్రోలింగ్ చేస్తూ.. మానసికంగా వేధిస్తున్నారని తాజా ఫిర్యాదులో పేర్కొంది.  


Similar News