కోడి పందాల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి.. 15 మంది అదుపులోకి..

కోడి పందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేసిన ఘటన బెజ్జూర్ మండల పరిధిలోని మొగవెళ్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-04 05:24 GMT

దిశ, బెజ్జూర్: కోడి పందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేసిన ఘటన బెజ్జూర్ మండల పరిధిలోని మొగవెళ్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోడి పందాల స్థాపరాలపై కౌటాల సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో చింతల‌మానేపల్లి ఎస్సై నరేష్, బెజ్జూర్ ఎస్సై విక్రం గురువారం రాత్రి మెరుపు దాడి నిర్వహించారు. ఈ మేరకు పందాలు ఆడుతున్న 30 మంది బైక్‌లు, నాలుగు కోళ్లు, రూ.3,289 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా బెజ్జూర్ ఎస్సై విక్రమ్ తెలిపారు. అదేవిధంగా కోళ్ల పందాలు ఆడుతోన్న 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని తెలిపారు. 


Similar News