తిర్యాణిలో దారుణం..మహిళ పై వ్యక్తి గొడ్డలితో దాడి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో గురువారం దారుణం చోటుచేసుకుంది.

Update: 2024-10-03 13:54 GMT

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. మండలంలోని సుంగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దానాపూర్ గ్రామానికి చెందిన టేకం మారుబాయి గిరిజన మహిళ పై అదే గ్రామానికి చెందిన ఆత్రం రాజు అనే వ్యక్తి గొడ్డలితో తలపై దాడి చేశాడు. రక్తస్రావంతో స్పృహ తప్పి కింద పడిన ఆమెను స్థానికులు గమనించి హుటాహుటిన తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


Similar News