ప్రాణాల మీదకు తెచ్చిన ఆట సరదా…విద్యుత్ షాక్ కు గురైన చిన్నారులు

ఆట సరదా ఇద్దరు పిల్లల ప్రాణాల మీదకు వచ్చింది. మండల కేంద్రంలోని కేవీ నగర్ కు చెందిన రెహాన్ 12, సమీరా 10

Update: 2024-10-03 14:03 GMT

దిశ, వాంకిడి : ఆట సరదా ఇద్దరు పిల్లల ప్రాణాల మీదకు వచ్చింది. మండల కేంద్రంలోని కేవీ నగర్ కు చెందిన రెహాన్ 12, సమీరా 10 అన్న చెల్లెలు ఇద్దరు గురువారం సాయంత్రం ఇంటి ముందు సరదాగా అడుకుంటున్న క్రమంలో బాల్ తమ ఇంటి రేకుల షేడు పై పడింది. ఇంటి గేట్ నుంచి పైకెక్కి బాల్ తీస్తున్న క్రమంలో రేకుల షెడ్ కు ఆనుకొని ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తగిలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మహారాష్ట్రలోని చంద్రపూర్ కు తరలించారు.


Similar News