2024లో భారత్‌కు ప్రధాని ఆయనే: అమిత్ షా కీలక వ్యాఖ్యలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు.

Update: 2023-04-23 14:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ చేవెళ్లలో తలపెట్టిన విజయ సంకల్ప సభలో ప్రధాని పదవిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఎన్నో కలలు కంటున్నారని.. కానీ ప్రధాని సీటు ఖాళీగా లేదనే విషయం కేసీఆర్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని.. 2024లో కూడా భారత్‌కు ప్రధాని మోడీనే అని కీలక వ్యాఖ్యలు చేశారు. పీఎం సీటు కాదు.. ముందు సీఎం సీటు కాపాడుకోవాలని కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయని.. కేసీఆర్‌ను గద్దె దించేవరకు తమ పోరాటం ఆగదని అమిత్ షా తేల్చి చెప్పారు. కేసీఆర్ అరాచక పాలనను దేశమంతా గమనిస్తోందని అన్నారు.

Tags:    

Similar News