పేషెంట్లు వచ్చినా.. డాక్టర్లే రాలే..!

Update: 2024-08-16 09:01 GMT

దిశ, భైంసాః అసలే వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల బారినపడి ముధోల్ తాలూకా వ్యాప్త ప్రజలే కాకుండా సరిహద్దు పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుండి సైతం పేషెంట్లు బైంసా ఏరియా ఆసుపత్రికి వందలలో వస్తుంటారు. శుక్రవారం డాక్టర్లు లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 20కిపైనే సంఖ్యలో డాక్టర్ల వున్నా.. 15 మంది డాక్టర్లు లీవ్ లో వున్నట్టు పేషెంట్లు తెలిపారు. ఓపీ విభాగంలో సైతం డాక్టర్స్ పూర్తి సంఖ్యలో లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ రోగులు వాపోయారు. ఇదిలా ఉంటే ఆసుపత్రి సూపర్డెంట్ కి వివరణ కోరగా పలువురు డాక్టర్లు ఆరోగ్య సమస్యలతో సెలవులో ఉన్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News