దిశ ఎఫెక్ట్.. గోదావరి ఘాట్ వద్ద రక్షణ, హోంగార్డుల నిఘా

Update: 2024-09-02 09:13 GMT

దిశ, బాసర : ఈ రోజు ఉదయం దిశ ఈ పేపర్ లో వచ్చిన బాసర వద్ద గోదావరి ఉగ్ర రూపం శీర్షికన వచ్చిన వార్తకు ఆలయ అధికారులు రెవెన్యూ అధికారులు స్పందించారు. గోదావరి ఘాటు వద్ద భక్తులకు తగిన విధంగా ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ప్రతిక్షణం నిఘా ఉండేలా ముగ్గురు హోంగార్డ్ లను ఘాట్ వద్ద డ్యూటీలో ఉంచారు. ఉగ్రరూపిణిగా ప్రవహిస్తున్న గోదావరి నది ఘాట్ లను బాసర తాహసిల్దార్ పవన్ చంద్ర, ఎస్సై గణేష్ లు సందర్శించి ఆలయ ఘాట్ నిర్వాహకులకు తగిన సూచనలు అందించారు.


Similar News