ఉపాధ్యాయులను నియమించాలి

పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ గురువారం జిల్లా కేంద్రంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

Update: 2024-09-19 09:38 GMT

దిశ, ఆసిఫాబాద్ : పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ గురువారం జిల్లా కేంద్రంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఇటీవల పాఠశాలలోని 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బోధన చేసే టీచర్లు లేక తరగతి గదుల్లో ఖాళీగా కూర్చుంటున్నామని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. అంతకుముందు పాఠశాల నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రోడ్డు పై బైఠాయించి రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. 

Tags:    

Similar News