విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

Update: 2024-09-19 09:14 GMT

దిశ, చెన్నూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధుల పట్ల అశ్రద్ధ వహించకూడదని, ప్రతి విద్యార్థి పై శ్రద్ధ వహించి బోధన పద్ధతులలో మెళకువలు పాటించి విద్యార్థులకు అర్ధమయ్యే విధంగా బోధించాలని సూచించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరగతి గదులలో తిరుగుతూ విద్యార్థుల ద్వారా ఉపాధ్యాయుల తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. 

Tags:    

Similar News