ఓరియంట్ సిమెంట్ కంపెనీ నాలుగవ ప్లాంటు విస్తరణ పనులు ప్రారంభం...

ఓరియంట్ సిమెంట్ కంపెనీ నాలుగవ ప్లాంటు విస్తరణ పనులను సోమవారం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

Update: 2023-05-08 13:57 GMT

దిశ, కాసిపేట : ఓరియంట్ సిమెంట్ కంపెనీ నాలుగవ ప్లాంటు విస్తరణ పనులను సోమవారం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా కాసిపేట మండలానికి వచ్చిన మంత్రికి స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఓరియంట్ సిమెంట్ కంపెనీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ఓరియంట్ సిమెంట్ కంపెనీ నాలుగవ ప్లాంటును రెండువేల కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారని, తద్వారా ప్రత్యేకంగా, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా పరదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, కొనేరు కొనప్ప, సర్పంచ్ లు తిరుమల అనంత్ రావు, జంగు, సిమెంట్ కంపెనీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News