MLA : విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు

విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.

Update: 2024-10-06 10:45 GMT

దిశ, ఉట్నూర్ : విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల ఎంబీబీఎస్ సీటు సాధించిన వెడ్మ మనిషాను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కష్టపడేతత్త్వం పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధింవచ్చన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్యం గొప్పదై ఉండాలని, విద్యార్థులు మొబైల్ ఫోన్ లకు బానిస కావద్దని, నిత్యం పుస్తకాలను చదువుతూ ఉండాలని సూచించారు. సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. మనీషా వైద్య రంగంలో ఉన్నత చదువుల చదువుకొని ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మనీషా కుటుంబ సభ్యులు వెడ్మ శ్యామ్ రావ్ ఉన్నారు.


Similar News