భైంసా డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం ఎన్నిక...

నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం ఎన్నిక ఆదివారం స్థానిక పట్టణ విశ్రాంతి భవనంలో సభ్యుల సమక్షంలో నిర్వహించారు.

Update: 2024-10-06 12:12 GMT

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం ఎన్నిక ఆదివారం స్థానిక పట్టణ విశ్రాంతి భవనంలో సభ్యుల సమక్షంలో నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు గా అబ్దుల్ బషీర్, అధ్యక్షులు గా బొండ్ల శ్రీనివాస్ (ఎచ్.ఎం.టివి), ఉపాధ్యక్షులుగా దేవేందర్, విలాస్, కార్యదర్శిగా ఎస్.రామకృష్ణ, కుంట రాజేశ్వర్, కోశాధికారిగా వెంకటేశ్, పి.అర్.ఓగా బి.రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీడియా సమస్యలపై నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గానికి సభ్యులు శాలువా పూలమాలతో సన్మానించి,మిఠాయిలు తినిపించారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎన్నికలో సభ్యులు ఇస్మాయిల్, దత్తాత్రి, విజయ్, సత్యనారాయణ, పవన్, గోవింద్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News