రైతులు దళారులకు సోయా అమ్మి మోసపోవద్దు.. ఎమ్మెల్యే అనిల్ జాధవ్

నేరడిగొండ మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ప్రారంభించారు.

Update: 2024-10-16 07:32 GMT

దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే రైతులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ రైతులు ఎవరూ కూడా దళారుల వద్ద సొయాలు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ. 4892/- ప్రకటించిందని అన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతుల కొరకు అధికారులు నీళ్లు, భోజనం సదుపాయలు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కుఫెడ్ ఆఫీసర్లతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News