Abhay Patil : తెలంగాణ బీజేపీకి కొత్త ఇన్ చార్జ్.. లోకల్ బాడీ ఎన్నికల వేళ అధిష్టానం కీలక నిర్ణయం

బీజేపీ అధిష్టానం మరో సంచనల నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-17 13:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధిష్టానం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జిగా అభయ్ పాటిల్ ను నియమించింది. ఈ మేరకు ఈ విషయాన్ని అభయ్ పాటిల్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో అభయ్ పాటిల్ తెలంగాణ ఇన్ చార్జిగా వ్యవహరించారు. కర్నాటకలోని దక్షిణ బెల్గాం నుంచి మడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. క్రమంలో సోషల్ మీడియా ద్వారా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఓట్ పర్సెంటేజ్ సాధించిన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్కాగా ప్రణాళికలు వేయాలని చూస్తున్నది. ఈ క్రమంలో అభయ్ పాటిల్ ను ఇన్ చార్జిగా నియమించడం ద్వారా ఎలాంటి ఫలితాలు రాబట్టబోతున్నదనేది చూడాలి. 

Tags:    

Similar News