డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కోట్లు కొల్లగొట్టిన ముఠా అరెస్ట్

హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పిస్తామని కోట్లు కొల్లగొట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-08-23 11:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పిస్తామని కోట్లు కొల్లగొట్టిన ముఠాను రాచకొండ కమిషనరేట్, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కుషాయిగూడకు చెందిన ఏనుగు సురేందర్ రెడ్డి మరో అరుగురితో కలిసి ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానని, నచ్చిన చోటుకి ప్రభుత్వ ట్రాన్ఫర్లు చేయిస్తామని పేదల నుండి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. 99 మంది దగ్గర డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో, మొత్తం 107 మంది దగ్గర వివిధ రకాల మోసలతో రూ.1.29 కోట్లు వసూలు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ క్రమంలో నిందితులు ఏకంగా గురుకుల సెక్రెటరీకి ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో సురేందర్ రెడ్డి, మెరీనా రోస్, అంజయ్య, వెంకటేశ్, గోపాల్ నాయక్, హర్షణీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. బడితుల దగ్గర వసూలు చేసిన క్రికెట్ బెట్టింగుల్లో, విలాసాలకు ఖర్చు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.   


Similar News