భారీ వర్ష సూచన.. ప్రజలను, వీఆర్ఏలను హెచ్చరించిన తహసీల్దార్

దిశ, బోథ్ : రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తహసీల్దార్ శివరాజ్.. ప్రజలను హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. రానున్న 48 గంటలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. గ్రామాల్లో వీఆర్ఏలు మైకుల ద్వారా దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలు ఎవరూ బయటకు వెళ్లవద్దని కోరారు. […]

Update: 2021-08-30 06:54 GMT

దిశ, బోథ్ : రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తహసీల్దార్ శివరాజ్.. ప్రజలను హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. రానున్న 48 గంటలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.

గ్రామాల్లో వీఆర్ఏలు మైకుల ద్వారా దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలు ఎవరూ బయటకు వెళ్లవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News