సెప్టెంబర్ 21న మార్కెట్లోకి Motorola కొత్త స్మార్ట్‌ఫోన్

Motorola కంపెనీ ఇండియాలో కొత్తగా ‘Edge 40 Neo’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది

Update: 2023-09-19 15:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: Motorola కంపెనీ ఇండియాలో కొత్తగా ‘Edge 40 Neo’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. సెప్టెంబర్ 21న ఇది భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంచనాల ప్రకారం, దీని ధర రూ.24,999. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంటుంది. ఈ ఫోన్ 6.55-అంగుళాల పూర్తి-HD+(1,080x2,400 పిక్సెల్‌లు) poLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Android 13 ద్వారా రన్ అవుతుంది. ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7030 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 68W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు. అలాగే, దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ కలిగి ఉంది.


Similar News