Airtel వినియోగదారులకు అలెర్ట్‌.. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో మార్పులు..!

ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి దిగ్గజ టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి.

Update: 2024-09-06 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌టెల్ (Airtel), జియో (jio), వొడాఫోన్ ఐడియా (vodafone) వంటి దిగ్గజ టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. ఇటీవల జియో.. తమ ప్రీ పెయిడ్(pre paid), పోస్ట్ పెయిడ్(post paid) ప్లాన్‌ల కోసం ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఎయిర్‌టెల్ కూడా తన మొబైల్ రీచార్జ్ ప్లాన్లను అప్‌డేట్ చేసింది. అందులో భాగంగా ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను 10 శాతం నుంచి 21 శాతం వరకు పెంచింది. దీని వల్ల వినియోగదారులు మొబైల్ డేటా(mobile data), వాయిస్ కాలింగ్(voice calling) మరియు SMS సేవలను యాక్సెస్ చేయడం ఖరీదైనదిగా మారింది. కాగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం..

Airtel కొత్త అపరిమిత వాయిస్ ప్లాన్‌లు:

# రూ. 199 ప్లాన్ : 2GB డేటా, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 100 SMS/రోజు.

# రూ. 509 ప్లాన్ : 6GB డేటా, అపరిమిత కాలింగ్, 84 రోజుల పాటు 100 SMS/రోజు.

# రూ. 1999 ప్లాన్‌ : 24GB డేటా, అపరిమిత కాలింగ్‌, 100 SMS/రోజుకు 365 days.

# రూ. 299 ప్లాన్: 1GB డేటా/రోజు, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 100 SMS/రోజు.

# రూ. 349 ప్లాన్: 1.5GB డేటా/రోజు, అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 100 SMS/రోజు.

# రూ. 409 ప్లాన్: 2.5GB డేటా/రోజు, అపరిమిత కాల్‌లు, 28 రోజుల పాటు 100 SMS/రోజు.

# రూ. 649 ప్లాన్ : 56 రోజుల పాటు 2GB డేటా/రోజు, అపరిమిత కాలింగ్‌, 100 SMS/రోజు.

సెప్టెంబర్ 15 నుంచి ఈ కొత్త రేట్లు మరియు ధరల పెరుగుదల అమల్లోకి వస్తాయి కాబట్టి కస్టమర్‌లు ఈ మార్పులకు సిద్ధం కావాలి. టారిఫ్‌లను సవరించడానికి ఎయిర్‌టెల్ చర్య విస్తృత పరిశ్రమ ధోరణులకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. బడ్జెట్ వినియోగదారులపై ప్రభావం తక్కువగా ఉంటుందని, సరసమైన ప్లాన్‌లపై ఆధారపడే వారికి, రోజుకు 70 పైసల కంటే తక్కువ పెంపు విలువ ఉంటుందని పేర్కొంది.


Similar News