సీఎం జగన్‌కు స్వామి పరిపూర్ణానంద వార్నింగ్ 

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల అంటే మీకు గొర్రెల లాంటి  భావన ఉందని అది మార్చుకోవాలని సీఎం జగన్‌కు స్వామి పరిపూర్ణానంద హితవు పలికారు. అమరావతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హిందువులు నమ్మి మీకు ఓట్లు వేశారు మీరు వాళ్లని మోసం చేస్తున్నారు. మతమార్పిడులు చేసేవారిని మీరు ఎందుకు అడ్డుకోవడం లేదు. కర్ణాటకలో మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేశారు మీరు ఏం చేస్తున్నట్టు. పింక్ […]

Update: 2021-12-24 05:50 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల అంటే మీకు గొర్రెల లాంటి భావన ఉందని అది మార్చుకోవాలని సీఎం జగన్‌కు స్వామి పరిపూర్ణానంద హితవు పలికారు. అమరావతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హిందువులు నమ్మి మీకు ఓట్లు వేశారు మీరు వాళ్లని మోసం చేస్తున్నారు. మతమార్పిడులు చేసేవారిని మీరు ఎందుకు అడ్డుకోవడం లేదు. కర్ణాటకలో మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేశారు మీరు ఏం చేస్తున్నట్టు. పింక్ డైమండ్ దొంగిలించిన వారిని మీరు ఎందుకు పట్టుకోవడం లేదు మీకు సమర్థత లేదా? విజయవాడలో పగలగొట్టిన గుళ్ళను ఎప్పుడు పునర్ నిర్మిస్తారో చెప్పాలి. తిరుమలలో కోటీశ్వరులకు సేవలు ఆపాలి అని స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. తిరుమలలో కోటీశ్వరులకు సేవలు ఆపకపోతే పరిపూర్ణానంద తిరుమల నుంచి తాడేపల్లి వరకు పాదయాత్ర చేసి సెగ పుట్టిస్తాడని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం పద్దతులు మార్చుకోవాలని లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో గడపగడపకు తిరిగి మీరు చేసే అరాచకాలు గురించి బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. హిందూ వ్యతిరేక శక్తుల పట్ల కనికరం చూపించకుండా వ్యవహరించాలి. మా మాటలను పెడచెవిన పెడితే ఆంధ్రరాష్ట్రంలో హిందూ సునామీని చూస్తారు. క్రిస్మస్ రోజునే ఈ పనులకు శ్రీకారం చుట్టండి’ అని సూచించారు.

‘2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయంటే అందులో కోటి 40 లక్షల ఓట్లు కేవలం హిందువులే వేశారు. కానీ ముఖ్యమంత్రి వైఖరి చూస్తుంటే హిందువుల పండుగలకు ఆంక్షలు పెడతారు. విజయవాడలో గుళ్ళు పగలగొడుతున్నారు. అప్పుడు వీళ్లంతా రోడ్లపైకి వచ్చిన వారే. దేవాదాయ మంత్రి విజయవాడలో ఉండి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రతి జిల్లాలో పథకం ప్రకారం దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతర్వేది రథం కాల్చేస్తే వాళ్ళ గుడ్డలూడదీయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి పనులు చేస్తే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నారు. రామతీర్థం లో దేవుడి తల తొలగిస్తే చూసీచూడనట్లు వ్యవహరించారు. మీకు హిందువుల ఆవేదన తెలియడం లేదా ఎందుకు ప్రతిస్పందించడం లేదు’ అని పరిపూర్ణానంద వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

వేయి కాళ్ళ మండపం పునరుద్ధరణ ఏమైంది..?

‘వేయి కాళ్ళ మండపం పునరుద్ధరిస్తామని జీయర్ స్వామి సమక్షంలో ఇచ్చిన హామీ ఏమైంది. పింక్ డైమండ్ విషయంలో వాస్తవాలు బయట పెట్టండి. టీటీడీలో మిరాశీ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్ని మీరు ఉద్యోగులుగా మార్చారు. అంటే మీ కాళ్లు పట్టుకుంటూ కూర్చోవాలా అని నిలదీశారు. తిరుమలలో వెంకటేశ్వరుడే గొప్ప కోటీశ్వరుడు కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరునిది మాత్రమే అని చెప్పుకొచ్చారు. వకుళమాత గురించి పోరాటం చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించి మంచి ఆలయాన్ని నిర్మించారు దానికి మనసా వాచా కర్మణా అభినందిస్తున్నాను. క్రైస్తవ మహ్మదీయ సమాజాన్ని నేనెప్పుడు విమర్శించను. టీటీడీలో డబ్బులు విపరీతంగా పెంచుతున్నారు. సేవల పేరుతో డబ్బులు వసూలు చేసి వేరే వాటికి పెట్టకండి. ఆస్పత్రులు విద్యాలయాలు రోడ్లు నిర్మించాలంటే వేరే సొమ్ముతో పెట్టండి. టీటీడీ సొమ్ముతో నిర్మించమని ఆగమ శాస్త్రం లో ఎక్కడా లేదు అని పరిపూర్ణానంద స్వామి నిలదీశారు.

గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

‘గోమాత వెంకటేశ్వర స్వామికి పాలిచ్చి పోషించింది. టీటీడీ ఈవో కానీ పాలకవర్గం కానీ గోవధను ఆపమని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కోరడం లేదు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ఏపీలో కొన్ని శక్తులు విపరీతమైన డబ్బు ఖర్చుపెట్టి మతమార్పిడులు చేస్తున్నారు. బీజేపీ కోరితే కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాను. త్వరలో యూపీలో కూడా ఆ పార్టీ తరఫున కార్యక్రమాల్లో పాల్గొంటాను. కానీ ఏపీలో జరుగుతున్న పరిణామాలను రాజకీయ కోణంలో కాకుండా హిందుత్వ అజెండా తో పోరాటం చేస్తాను. నా పోరాటంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు వచ్చిన కలుపుకొని పోతాను. రాజకీయాలు వేరైనా భక్తి మాత్రం అందరికీ ఉంటుందని’ స్వామి పరిపూర్ణానంద తెలిపారు. డెల్టా వేరియంట్ నెపంతో గతంలో హిందువుల పండుగలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతమైన ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు ఒమిక్రాన్ నేపథ్యంలో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కి అంక్షలు వర్తించవా అంటూ ప్రభుత్వాన్ని స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు.

Tags:    

Similar News