‘గత ప్రభుత్వం 18వేల కోట్ల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే’.. మంత్రి నిమ్మల సంచలన ఆరోపణలు

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-10-03 12:53 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక జలవనరుల శాఖలోనే పెట్టిందని విమర్శించారు. వైసీపీ హాయాంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే 2019-24 మధ్య ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. వైసీపీకి ఊడిగం చేసే క్రమంలో కొందరు ఉన్నతాధికారులు పని విధానం మర్చిపోయారని అనిపిస్తోందని మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మరుగున పడ్డ వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతామని మంత్రి నిమ్మల తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News